Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలువైద్యరంగంలో విప్లమాత్మక మార్పులు: ఎంపీ ప్రసాదరావు

వైద్యరంగంలో విప్లమాత్మక మార్పులు: ఎంపీ ప్రసాదరావు

చిత్తూరు ఎంపీ దగ్గు మల్లప్రసాదరావు, రాష్ట్రమంతా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు ప్రకటించారు. బుధవారం, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా, ఎంపీ మాట్లాడుతూ, జీవన ప్రమాణాలు పెరగడానికి వైద్య సదుపాయాలు పెరగాలి అని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాయని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించాలని సంకల్పించారు. ఈ దృష్టిలో, గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ని సదుపాయాలతో కూడిన వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వైద్య రంగంలో పెద్ద మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని అన్నారు.యాదమరిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, గ్రామీణ ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు సీఆర్ రాజన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article