Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుమనీశ్ సిసోడియాకు బెయిల్: సుప్రీంకోర్టు

మనీశ్ సిసోడియాకు బెయిల్: సుప్రీంకోర్టు

మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం చాలా ప్రాముఖ్యత కలిగిన నిర్ణయం. లిక్కర్ పాలసీ కేసులో సుమారు 17 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, ఇప్పుడు జైలు నుంచి విడుదల కాబోతున్నారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థలో ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యతను మరింత వెలుగులోకి తెచ్చాయి.
సిసోడియాకు విచారణ వేగంగా పూర్తిచేయాలని కోరే హక్కు ఉందని న్యాయమూర్తులు తెలిపారు. విచారణను దయచేసి సాగదీయడం సరికాదని చెప్పారు. ట్రయల్ జరుగుతోందనే పేరుతో అనుమానితుడిని నిరవధికంగా జైలులో ఉంచడం సరికాదని తేల్చిచెప్పారు. సిసోడియాను మళ్లీ ట్రయల్ కు పంపడాన్ని వైకుంఠపాళీ ఆడించడం వంటిదని పేర్కొన్నారు. ఇది సిసోడియా ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.బెయిల్ ఇవ్వకుండా సుదీర్ఘ కాలంపాటు జైలులో ఉంచడం అనుమానితుడిని శిక్షించడంగా భావించకూడదనే విషయాన్ని కింది కోర్టులు మరిచిపోయాయని జస్టిస్ బీఆర్ గవాయి విమర్శించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరియు సీబీఐ 493 మంది సాక్షుల స్టేట్‌మెంట్స్ ని పరిశీలించిన తర్వాత, మనీశ్ సిసోడియా కేసు ట్రయల్ ను మరింత పొడిగించేందుకు ఎలాంటి అవకాశాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article