Thursday, May 8, 2025

Creating liberating content

తాజా వార్తలుకృత్తివెన్ను ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం

కృత్తివెన్ను ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం

కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు పలువురికి గాయాలయ్యాయి.పాండిచ్చేరి నుండి భీమవరం రొయ్యల ఫీడ్ వెళ్తున్న కంటైనర్అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్ళరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వస్తున్న బొలెరో వ్యాన్ కృత్తివెన్ను మండలంశీతనపల్లి వద్ద పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొని ఓవర్ టాక్ చేస్తూ కంటైనర్ ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.ఈ దుర్ఘటనలోఅక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా గాయపడిన మరో ఆరుగురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు.ఐదుగురు పరిస్థితి విషమం గా ఉంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో రెండు మూడు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article