Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలురాజకీయ పార్టీపై కూడా పరువు నష్టం దావా వేయొచ్చు : కర్నాటక హైకోర్టు

రాజకీయ పార్టీపై కూడా పరువు నష్టం దావా వేయొచ్చు : కర్నాటక హైకోర్టు

రాజకీయ పార్టీపై కూడా పరువు నష్టం దావా వేయొచ్చని కర్నాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, బీజేపీపై వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. భారత్ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు తగిన రక్షణ అవసరమని న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల పరువునష్టం అంత తీవ్రమైన నేరం కానప్పటికీ, దాన్ని తేలికగా తీసుకోలేమని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో తమ అభిప్రాయాలు, ప్రత్యేక కోర్టులో పెండింగులో ఉన్న పురువునష్టం కేసుపై ఎలాంటి ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది.ఈ పిటిషన్‌‍పై జస్టిస్ ఎస్ దీక్షిత్ ధర్మాసనం విచారణ జరిపింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 499, 500 ప్రకారం రాజకీయ పార్టీని వ్యక్తిగా పరిగణించలేమని బీజేపీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీజేపీ వాదనపై రిజ్వాన్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐపీసీ సెక్షన్ 11లో వ్యక్తిని నిర్వచించారని, పార్టీ కూడా చాలా మంది వ్యక్తులతో కూడిన సంస్థ అని వాదించారు. ‘ప్రభుత్వాలు, కంపెనీలు, కార్మిక సంఘాలకు, వారి సొంత గౌరవం ఉంటుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడి గౌరవానికి భంగం కలిందనే కారణంతో పరువునష్టం నమోదైంది. దానిపై ప్రత్యేక కోర్టు చర్యలు తీసుకోవడం సరైనదే’ అని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం బీజేపీ పిటిషన్‌ను కొట్టివేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article