Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలువిజయవాడలో నటి కాదంబరి జత్వానీ..

విజయవాడలో నటి కాదంబరి జత్వానీ..

ముంబైకి చెందిన హిందీ నటి కాదంబ‌రి జత్వానీ, లైంగిక వేధింపుల కేసులో న్యాయం కోసం విజయవాడకు చేరుకున్నారు. గడచిన నాలుగు రోజులుగా సంచలనం రేపిన ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, జత్వానీ ముంబై నుండి హైదరాబాద్ మీదుగా విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ పోలీసుల ప్రత్యేక బందోబస్తు మధ్య నగరానికి చేరుకున్న ఆమె, తన దగ్గర ఉన్న ఆధారాలను మరియు కేసు వివరాలను పోలీసులు, ఏపీ ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమయ్యారు.జత్వానీ ఇంతకుముందే ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరియు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయంపై విచారణ జరిపేందుకు ఏసీపీ స్రవంతి రాయ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. జత్వానీపై గతంలో నమోదైన ఫోర్జరీ కేసు వివరాలు కూడా సేకరించాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది.ముంబై నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంలో విలేకరులతో మాట్లాడిన జత్వానీ, ఏపీ పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టి, అనేక రకాలుగా వేధించారని ఆరోపించారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను ప్రభుత్వానికి అందిస్తానని, ఏపీ ప్రభుత్వంపై నమ్మకం ఉందని, న్యాయం జరిగే నమ్మకం ఉందని చెప్పారు.సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ, తన వ్యక్తిత్వాన్ని హాననం చేసేలా మాట్లాడుతున్నారని, ఈ అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article