Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలురఘురామ కేసులో మాజీ సీఐడీ అధికారికి హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరణ

రఘురామ కేసులో మాజీ సీఐడీ అధికారికి హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరణ

ఏపీ సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్, రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కే కృష్ణాసాగర్ ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపి, విజయపాల్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ఎంపీ రఘురామ కృష్ణరాజుపై రాజద్రోహం తదితర సెక్షన్ల కింద ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రఘురామ ఆయనను అరెస్టు చేసినప్పుడు సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారంటూ ఫిర్యాదు చేశారు, దీని ఆధారంగా గుంటూరు నగరంపాలెం పోలీసులు విజయపాల్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు.విజయపాల్ తరపు న్యాయవాది కిశోర్ కుమార్, హైకోర్టులో వాదిస్తూ రఘురామను నిబంధనల ప్రకారం సీఐడీ అరెస్టు చేసి విచారణ జరిపిందని చెప్పారు. రఘురామ శరీరంపై గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిందని వాదించారు. అయితే, పోలీసుల తరపున సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పీపీ మెండ లక్ష్మీనారాయణ, రఘురామకు గాయాలు అయినట్లు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ఈ వాదనల ఆధారంగా న్యాయమూర్తి విజయపాల్‌కు మధ్యంతర మందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article