Monday, February 16, 2026

Creating liberating content

టాప్ న్యూస్బందరు పోర్టును 2025 నాటికి పూర్తిచేస్తాం

బందరు పోర్టును 2025 నాటికి పూర్తిచేస్తాం

పోర్టు నిర్మాణానికి అవసరమైన భూమిని అందిస్తాం

బందరు పోర్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు

మచిలీపట్నం :- 2025 నాటికి బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రూ.3,669 కోట్ల అంచనాతో చేపట్టిన పోర్టును వైసీపీ ప్రభుత్వంలో వేగం లేకపోవడంతో 24 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. బందరుపోర్టు పనులను బుధవారం పరిశీలించిన సీఎం పనుల పురోగతిపై పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోర్టు నిర్మాణానికి అవసరమున్న మరో 38.32 ఎకరాల భూమిని అందిస్తామన్నారు. పోర్టు పనులు పూర్తైతే మొదట నాలుగు బెర్త్ లు ఏర్పాటు అవుతాయని, మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్త్ ల దాకా ఏర్పాటు చేయవచ్చన్నారు. పోర్టు పూర్తైతే మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, అమరావతి రాజధానికి కూడా ఈ పోర్టు దగ్గరగా ఉంటుందన్నారు. అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ స్ట్రీమ్ లైన్, నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. కంటైనర్ పోర్టు కింద ఇంటిగ్రేడ్ చేస్తే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పోర్టు కోసం యేళ్ల కొద్దీ ఉద్యమాలు నడిచాయని గుర్తు చేశారు. ప్రాధాన్యతను గుర్తించి తాను పోర్టు పనుల ప్రారంభిస్తే తర్వాత వచ్చిన పాలకులు విధానాలు మార్చి నిర్లక్ష్యం చేశారన్నారు. తాను కూడా మార్చితే విధ్వంసం చేసినట్లు అవుతుందని..పనులను యధావిధంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు తెస్తామని, బీపీసీఎల్ ఏర్పాటుపైనా త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. పోలీస్ ల్యాండ్ లో కట్టిన వైసీపీ కార్యాలయంపై సమాచారం సేకరించి యాక్షన్ తీసుకుంటామని సీఎం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article