Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలురుణమాఫీ పాక్షికమే

రుణమాఫీ పాక్షికమే

రైతు రుణమాఫీపై హరీశ్ రావు ప్రెస్ మీట్

తెలంగాణలో రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి బూటకపు హామీలు ఇస్తున్నారని, రైతు రుణమాఫీ పూర్తిగా చేయకపోయినప్పటికీ తనను రాజీనామా చేయమని డిమాండ్ చేయడం విడ్డూరమని పేర్కొన్నారు.రైతు రుణమాఫీ కోసం కాంగ్రెస్ పార్టీ రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, కేబినెట్ మీటింగ్‌లో ఈ మొత్తం రూ.31 వేల కోట్లకు తగ్గించారని, చివరికి బడ్జెట్‌లో కేవలం రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. దీంతో మాఫీ కోసం చూపిన నిధులు సరిచేయడం కష్టమని పేర్కొన్నారు.హరీశ్ రావు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15 తర్వాత రుణమాఫీ పూర్తయిందంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు నిజం కావని పేర్కొంటూ, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని, సత్యనిష్టి ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై శనివారం హరీశ్ రావు స్పందించారు. రైతు రుణమాఫీకి సంబంధించి తన సవాలు గురించి మాట్లాడేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి బూటకపు మాటలు చెబుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఓ మాట, ఇప్పుడొక మాట అన్నట్లుగా మాటలతో పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలో సంపూర్ణ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానన్నారు. అయితే, ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా చేయలేదని, పాక్షికంగా మాత్రమే చేసిందని తెలిపారు. రుణమాఫీ లెక్కల విషయానికి వస్తే కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ఆధారంగానే మాఫీ లెక్కలు పరిశీలించవచ్చని చెప్పారు. రేవంత్ రెడ్డి వివిధ సందర్భాలలో మాట్లాడిన మాటలను వినిపిస్తూ రుణమాఫీ ఎక్కడ పూర్తయిందో చెప్పాలని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోలో రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. దీనికి సంబంధించిన పేపర్లను హరీశ్ రావు మీడియాకు చూపించారు. ప్రభుత్వంలోకి వచ్చాక రైతు రుణమాఫీపై కేబినెట్ మీటింగ్ తర్వాత ఈ మొత్తం నిధులు రూ.31 వేల కోట్లకు తగ్గించారని గుర్తుచేశారు. రుణమాఫీ అమలుకు రాష్ట్ర బడ్జెట్ లో రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని హరీశ్ రావు చెప్పారు. దీనిపై తాను అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీశానని గుర్తుచేశారు.‘‘ఎన్నికల మేనిఫెస్టోలో 40 వేల కోట్లని అన్నారు.. కేబినెట్ సమావేశంలో 31 వేల కోట్లు చెప్పారు, బడ్జెట్ లో 26 వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులు ఎక్కడ సరిపోతాయి? ఎవరికి ఎగవెడతరు?’’ అని ప్రశ్నించినట్లు చెప్పారు. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత నిజంగానే రుణమాఫీ పూర్తిచేశారేమోననే ఆశతో లెక్కలు చూశామని హరీశ్ రావు చెప్పారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయినట్లు గుర్తించామని హరీశ్ రావు చెప్పారు. రుణమాఫీ పూర్తిచేయకుండా తనను రాజీనామా చేయమనడం కాదు.. రైతు రుణమాఫీ పాక్షికంగానే చేసినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని, నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article