Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుఅగ్నిప్రమాద బాధితులకు వస్తువులు వితరణ

అగ్నిప్రమాద బాధితులకు వస్తువులు వితరణ

జీలుగుమిల్లి :చంద్రమ్మ కాలనీ గ్రామంలో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పరామర్శించడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సువర్ణ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.శ్రీరాములు దొర బట్టలు, దుప్పట్లు, వంట సామాగ్రి అందజేశారు. జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ అసిస్టెంట్ కే. ప్రసాద్ ఐదు లీటర్ల వంటనూనె సింగిల్ కాట్ ఫోల్డింగ్ మంచం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ నాగమణి, హెచ్ వీ నాగరత్నం, ఆదిలక్ష్మి ఏఎన్ఎం జి సుబ్బలక్ష్మి ,స్వరాజ్యలక్ష్మి, ఆశ కార్యకర్త లు రాజ్యలక్ష్మి గ్రామస్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article