Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుఛత్తీస్‌గఢ్‌లో పేలుడు పదార్థాల కేంద్రంలో భారీ పేలుడు… 10 మందికి పైగా మృతి

ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు పదార్థాల కేంద్రంలో భారీ పేలుడు… 10 మందికి పైగా మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది నుంచి 17 మంది వరకు చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పిర్దా గ్రామ సమీపంలోని బెర్లా డెవలప్‌మెంట్ బ్లాక్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి పోలీసులు, వైద్య సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఘటనాస్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article