Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలుద్వారంపూడి అవినీతిపై విచారణకు ఆదేశించాలి : టీడీపీ నేత వర్మ

ద్వారంపూడి అవినీతిపై విచారణకు ఆదేశించాలి : టీడీపీ నేత వర్మ

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ, వైకాపాకు చెందిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు చేస్తూ, తక్షణ విచారణకు డిమాండ్ చేశారు. వర్మ ఆరోపణల ప్రకారం, చంద్రశేఖర్ రెడ్డి ఇళ్ల స్థలాలను అక్రమంగా విక్రయించి, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు.ఈ అంశంపై వర్మ, పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. కాకినాడ నగర ప్రజల కోసం సేకరించిన 350 ఎకరాల భూమిని చదును చేయడంలో అవినీతి చోటుచేసుకుందని, ఆ భూమిని తన బినామీలకు కేటాయించి, తర్వాత విక్రయించడం ద్వారా భారీ కుంభకోణం జరిగిందని వర్మ ఆరోపించారు.ఈ అవినీతి కేసుపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, తక్షణ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పాల్గొని, చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article