Friday, November 21, 2025

Creating liberating content

తాజా వార్తలుఅమరావతి రైతుల కృతజ్ఞతా యాత్ర

అమరావతి రైతుల కృతజ్ఞతా యాత్ర

అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేలా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పనులు ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి యాత్ర మొదలు పెట్టారు.సోమవారం ఉదయం రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కృతజ్ఞతా యాత్ర ప్రారంభించారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర మొదలుపెట్టారు. అమరావతి రైతుల యాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. కాగా, రైతులు చేపట్టిన ఈ పాదయాత్ర సుమారు 20 రోజుల పాటు కొనసాగనుందని, తిరుమల చేరుకున్నాక రైతులు వెంకన్నకు మొక్కులు చెల్లించుకుంటారని ఎమ్మెల్యే చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article