Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలుస్వ‌ర్ణ భార‌త్ ట్ర‌స్ట్ వార్షికోత్స‌వంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్..

స్వ‌ర్ణ భార‌త్ ట్ర‌స్ట్ వార్షికోత్స‌వంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్..

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శనివారం, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడిని, వారి జీవితాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అంకితం చేసినందుకు ఆయనను కొనియాడారు. వెంకయ్య నాయుడి సామాజిక సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఈ కార్యక్రమం కోసం, ఉపరాష్ట్రపతి కర్నూలు జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి, నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయానికి చేరుకున్నారు. అక్కడ, ఆయన స్వామి వివేకానందుని ప్రతిమకు, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు.ఆ తర్వాత, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను చూసిన ఉపరాష్ట్రపతి, న్యూ ఢిల్లీకి తిరిగి వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు, తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ శర్మ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఇతర అధికారులు ఘన వీడ్కోలు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article