Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలుచెరువుల ఆక్రమణలను అడ్డుకోవడానికే ‘హైడ్రా’: కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల ఆక్రమణలను అడ్డుకోవడానికే ‘హైడ్రా’: కమిషనర్ ఏవీ రంగనాథ్

ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను ఎవరైనా చేసినా వాటిని కూల్చివేయడం పక్కా అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్, ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్‌లోని చెరువుల్లో 66 శాతం కబ్జాకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విధానాన్ని కొనసాగించితే కొన్ని సంవత్సరాల్లో చెరువులు కనిపించకుండా పోతాయని హెచ్చరించారు.హైడ్రా సంస్థ కేవలం కూల్చివేతలకే కాదు, నగరాన్ని ప్రకృతి విపత్తుల నుంచి రక్షించేందుకు, విపత్తుల సమయంలో వేగంగా స్పందించి ప్రజలను కాపాడేందుకు కృషి చేస్తుందని వివరించారు. చెరువులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను విశదీకరించడంతో పాటు, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.అక్రమార్కులు రాజకీయ నేతల అండతో లేదా అధికారులను లంచాలు ఇచ్చి భూములను కబ్జా చేయడం వంటి సమస్యలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.హైడ్రా అధికారులకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉందని, ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తే కచ్చితంగా కూల్చివేయబడతాయని ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ప్రజలు అక్రమంగా కబ్జా చేసిన భూముల్లో నిర్మాణాలను కొనుగోలు చేయవద్దని సూచించారు, లేనిపక్షంలో కట్టుకున్న ఇళ్లు కూల్చబడితే బాధపడాల్సి వస్తుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article