Friday, February 20, 2026

Creating liberating content

తాజా వార్తలుపిఠాపురం పట్టణం మురుగుమయం

పిఠాపురం పట్టణం మురుగుమయం

పిఠాపురం పట్టణంలో 30 వార్డులు సుమారు 50 వేల మంది జనాభా వున్నారు. పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు 150 మంది వుండవలసిన సిబ్బంది 70 మంది వున్నారు వీధులు శుభ్రం చేయటానికి సరిగ్గా వర్కర్స్ లేకపోవటంతో పట్టణంలో అన్ని వార్డులు మురుగునీరుతో నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో డయేరియా, అతిసార వ్యాధులు ప్రభాలి ప్రజలు ఆసుపత్రి పాలు అవుతున్నారు, కొంత మంది ప్రాణాలు వదిలేశారు. పురపాలక సంఘం అధికారులకు ప్రస్తుత పాలకులకు ఎన్నిసార్లు వి విన్నవించుకున్న పట్టించుకోవటం లేదు.
గతంలో మాజీ శాసన సభ్యులు SVSN. వర్మ టీడీపీ కార్యకర్తలతో కలిసి ఒకరోజు మురుగు కాలువ ప్రక్కన పడుకొని నిరసన తెలియచేశారు. అలాంటి వారి పైన కేసులు పెట్టారు అదీ పురపాలక సంఘం అధికారులు తీరు ఇప్పటికైనా అధికారులు పనితీరులో మార్పు రాకపోతే ప్రజలు తిరగబడే పరిస్తులు కనిపిస్తున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article