ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతుంది. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్ల నగదును సీజ్ చేశారు. జగ్గయ్యపేట మండలం గురికపాడు చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీలో తరలిస్తుండగా ఈ డబ్బును పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

