Monday, May 5, 2025

Creating liberating content

తాజా వార్తలుసామూహిక ఎలుకల నివారణ ద్వారా మరింత ఆదాయం

సామూహిక ఎలుకల నివారణ ద్వారా మరింత ఆదాయం

మండలపరిదిలో 84 కేజీలు ఉచితంగా మందు పంపిణీ

కాజులూరు

రైతులంతా తమ పోలాల్లో ఒకేసారి ఎలుకల నివారణకు మందు వాడితే మరింత ఆదాయం చేకూరుతుందని మండల వ్యవసాయ అదికారి వి.అశోక్ అన్నారు .ఈమేరకు శుక్రవారం
కాజులురు మండలం పరిధి లోగల 23 రైతు భరోసా కేంద్రాల్లో సామూహిక ఎలుకల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా రైతులకు ఎలుకల నివాణపై పలు చూచనలు చేసారు. అనంతరం.మండలపరిదిలో రైతులందరికీ 84కేజీల బ్రోమాడయోలోన్ ఎలుకల మందుని ఉచితంగా అందజేశారు.ఈసందర్భంగా శీల గ్రామం నందు మండల వ్యవసాయ అధికారి .వి అశోక్
పాల్గొని రైతులకు ఎర తయారీ విధానం తోపాటు మందు విషయంలో రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article