- రైతు సమస్యలు.. ఇరిగేషన్ రంగం దుస్థితి.. అథోగతి పాలైన వ్యవసాయ రంగంపై చర్చించే ధైర్యం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదు
- వాస్తవాలు బయటకొస్తే రైతులు తనను, తన ఫ్రభుత్వాన్ని ఛీ కొడతారన్న భయంతోనే జగన్ రెడ్డి టీడీపీ వాయిదా తీర్మానంపై చర్చ లేకుండా చేశాడు.
- రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉంటే, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలోఉంది.
- ఇక రైతు కుటుంబాలపై ఉన్న అప్పుల్లో ఏపీ ఏకంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
- జగన్ రెడ్డి వచ్చాక ఒక్కో రైతుకుటుంబంపై రూ.2.45లక్షల కోట్ల అప్పులభారం వేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
- రైతు సమస్యలపై ఉభయ సభల్లో గంటసేపు చర్చకు కూడా ఇష్టపడలేదంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రైతుద్రోహులు కాక ఏమవుతారు? రైతుల సమస్యలు, ఇరిగేషన్ రంగంపై చర్చించడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదని తేలిపోయింది : నిమ్మల రామానాయుడు
అమరావతి:సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడ్లారు. ఆయన ఏమన్నారంటే..“ సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగం, నిర్వీర్యమైపోయిన సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం చూస్తే, రైతుల సమస్యలపై, ఇరిగేషన్ రంగం దుస్థితిపై చర్చించడానికి జగన్ సర్కార్ ఇష్టపడ టం లేదని తేలిపోయింది. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలన మొత్తం వ్యవసాయరంగ వ్యతి రేక విధానాలతో ముందుకు సాగింది అనేది కాదనలేని వాస్తవం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉంటే, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉండటాన్ని బట్టే జగన్ ప్రభుత్వం ఎంతటి రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా రైతు కుటుంబాలపై ఉన్న అప్పుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముందువరసలో ఉంది. రాష్ట్రంలోని ఒక్కో రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు ఉంది. తెలంగాణ ప్రభుత్వం 2022-23లో 1.31కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 49.54లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నదిటీడీపీప్రభుత్వం ఉచితంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తే, జగన్ రెడ్డి దాన్ని ఎత్తేసి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రప్రభుత్వ నిబంధనలకు తలొగ్గి, రైతుల మెడలకు ఉరి తాళ్లు బిగించడానికి సిద్ధపడ్డాడు. ఏటా ప్రతి రైతుకి రూ.13,500లు ఇస్తానన్న జగన్ రెడ్డి చివరకు అధికారంలోకి వచ్చాక కేవలం రూ.7,500లతో సరిపెట్టాడు. జగన్ రెడ్డి నిర్వాకంతో ఒక్కోరైతు సంవత్సరానికి రూ.6వేల చొప్పున, ఐదేళ్లలో రూ.30వేలు నష్టపోయాడు. ధాన్యం కొనుగోళ్లలో కూడా జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. 2022-23 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 1.31 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం 49.54 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేసింది. ధాన్యాగారంగా పిలవబడే గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల పేరుతో రైతుల్ని దోచుకున్నారు. 75 కేజీలకు అదనంగా 10కేజీల ధాన్యం ఇస్తేనే కొంటామనే నిబంధన పెట్టి, రైతు ల కష్టాన్ని వైసీపీనేతలు దోచుకున్నారు. తేమఎక్కువని, రంగు మారిందని.. ఇతర సాకులు చెప్పి మరీ రైతుల కష్టాన్ని దోచేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కి తన శాఖలో ఏం జరుగుతోందో తెలియదు గానీ, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి దోపిడీ లేదని సమర్థించుకున్నాడు. సాధారణంగా రైతులు ధాన్యం అమ్ముకుంటే వారికి డబ్బులు వస్తాయి. కానీ జగన్ రెడ్డి రైస్ మిల్లుల ద్వారా కొనుగోళ్లు జరిపి, ముందు ధాన్యం తీసుకొని, తరువాత ఎప్పుడో రైతులకు డబ్బులు చెల్లించే దుస్థి తి తీసుకొచ్చాడు. జగన్ రెడ్డి గొప్పగా చెబుతున్న రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయి. ఉచిత పంటలబీమా అందిస్తానని చెప్పి రైతుల్ని మోసగించిన జగన్ రెడ్డి, చివరకు ప్రభుత్వం తరుపున చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించకుండా రైతుల్ని నిండా ముంచేశాడు. ప్రకృతి విపత్తులు, తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులకు పైసా కూడా ఇన్ పుట్ సబ్సిడీ సాయం అందించలేదు . వాస్తవంగా రైతులు ప్రకృతి విపత్తుల వల్ల రూ.30వేలకోట్ల విలువైన పంట ఉత్ప త్తులు నష్టపోతే, జగన్ రెడ్డి ప్రభుత్వం వారికి కేవలం రూ.2వేలకోట్ల సాయంతో సరిపెట్టింది. దశాబ్దాల నుంచి రైతులకు సేవలందిస్తున్న సహకార డెయిరీలను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి, తన కమీషన్ల కక్కుర్తితో అమూల్ వంటి సంస్థలను తెరపైకి తెచ్చాడు. లీటర్ పాలకు రూ.4ల బోనస్ ఇస్తానని చెప్పి పాడి రైతుల్ని వంచించాడు. ఆక్వా రైతులు ఏకంగా రాష్ట్రంలో హాలిడే ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వంలో ఆక్వాసాగు, ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆక్వా రైతుకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1కే చంద్రబాబు అందిస్తే, జగన్ రెడ్డి ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అనే నిబంధనలు పెట్టి, లక్షల్లో ఉన్నఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఎత్తేసి మొత్తం ఆక్వారంగాన్నే నాశనం చేశాడు. మరోపక్క ఈ ప్రభుత్వంలో ఆక్వా సీడ్ ఫీడ్ ధరలు భారీగా పెరిగాయి. పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ రెడ్డి గోదాట్లో ముంచేశాడుచంద్రబాబునాయుడు సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని 72శాతం పూర్తిచేశారు. సాగు విస్తీర్ణం పెంచడం కోసం పట్టిసీమను నిర్మించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగం పూర్తిగా పడకేసింది. పోలవరం పనులు ఎక్కడివక్కడ నిలిపేసి, చివరకు జాతీయప్రాజెక్ట్ ను గోదాట్లో ముంచేశారు. ఇలాంటి వాస్తవాలు బయటకు వస్తే, రైతులు తనను ఛీ కొడతారన్నభయంతోనే జగన్ రెడ్డి టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరక్కుండా చేశాడు. తనపై పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి అసహానికి గురైన స్పీకర్, ఆవేశంలో మమ్మల్ని సస్పెండ్ చేశాడనిపించిందిస్పీకర్ ముఖంలో అసహనం..ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన సొంత జిల్లాకు సంబంధించి నేడు పత్రికల్లో వచ్చిన వార్తలు చూశాక, ఆయన తీవ్ర మైన అసహనానికి గురై, ఆప్రభావంతోనే మమ్మల్ని సస్పెండ్ చేశారని అనిపిం చింది.” అని రామానాయుడు తెలిపారు.