ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని వైవీసుబ్బారెడ్డిని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ చేశారు. డేట్.. టైం.. వాళ్లు చెప్పినా… సరే.. నన్ను చెప్పమన్నా… సరే.. వస్తా.. అంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని షర్మిల డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల కంచిలి దగ్గర ఆర్టీసీ బస్ ఎక్కారు. బస్లో ప్రయాణికులతో ముచ్చటించారు. అమ్మఒడి అందుతుందా లేదా అని.. పలువురు మహిళలను ఇళ్ల స్థలాలు అందాయా అని అడిగి తెలుసుకున్నారు.