Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలురేణిగుంట చంద్రగిరి టౌన్ సర్వీస్ లను పునః ప్రారంభించాలని ర్యాలీ

రేణిగుంట చంద్రగిరి టౌన్ సర్వీస్ లను పునః ప్రారంభించాలని ర్యాలీ

రేణిగుంట
రేణిగుంట మండల అధ్యక్షులు జిపాలెం తేజవతి మాట్లాడుతూ టౌన్ సర్వీసులు వలన విద్యార్థులు సులభతరంగా యూనివర్సిటీలకు కాలేజీలకు వెళ్లేవారని అలాగే వ్యాపారస్తులు వృద్ధులు మహిళలు నిరంతరం సౌకర్యవంతంగా ప్రయాణించేవారు.బస్సులు లేకపోవడం వలన అనేక ఇబ్బందులతో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ మాట్లాడుతూ పుత్తూరు సత్యవేడు వెళ్లే బస్సులు రేణిగుంట వైపు వెళ్లేలా ఏర్పాటు చేయాలని, బస్టాండ్ లో మరుగుదొడ్లు మరమ్మతులు చేయించాలని తెలిపారు. ఓదార్పు సంఘం ప్రధాన కార్యదర్శి పుమాని ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గారిని కలిసి మెమొరాండం అందించ గా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జనరల్ సెక్రెటరీలు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి,తండ్లం వెంకటరమణారెడ్డి,సీనియర్ నాయకులు జీపాలెం కృష్ణారెడ్డి,యతేంద్ర,గెహ్లోత్,రాజ రాయల్,మునుస్వామిరెడ్డి,శ్యామ్, రాఘవులు యువ మోర్చా జీఎస్ వేణు, ట్రెజరర్ రవి,అశోక్ ,ఎస్సీ మోర్చా జిల్లా విపీ చంగల్ రాయులు,కొండా కిషోర్ , మురళి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article