Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుమిరప వంటి ఉత్పత్తుల మార్కెటింగ్ పై అవగాహన కార్యక్రమం

మిరప వంటి ఉత్పత్తుల మార్కెటింగ్ పై అవగాహన కార్యక్రమం

మార్కాపురం

మండలంలోని వెలుగు కార్యాలయం నందు జిల్లా ఉద్యాన అధికారి వై.యం.యన్ గోపీచంద్ గారి అధ్యక్షతన E-మిర్చా ప్రాజెక్ట్ కి సంబందించిన సమావేశం పెద్దరవీడు, మార్కాపురం, కొనకలమిట్ల, దొనకొండ, తర్లుపాడు, అర్ధవీడు, కంభం ఆర్.బీ.కె సిబ్బందికి నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్.బీ.కె సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ-మిర్చా ప్రాజెక్ట్ యొక్క టెక్నాలజీ సహకారంతో మిరప పంటలో నాణ్యతా ప్రమాణాలను మరియు దిగుబడులను పెంచడం అనే విషయాలను గురించి తెలియజేస్తుందని తెలిపారు.
డిజిటల్ గ్రీన్ సంస్థ కో-ఆర్డినేటర్ కమలాకర్ మాట్లాడుతూ ఈ-మిర్చా ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మిరప నాణ్యత పరీక్షా కేంద్రాలలో, రైతుల మిరప నాణ్యత ప్రమాణాలను పరీక్షించుకుని, వచ్చిన ఫలితాల సర్టిఫికెట్ ఆధారంగా, వ్యాపారవేత్తలు, కొనుగోలుదారుల వద్ద ఎక్కువ ధర పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క వినియోగాలు మరియు దాని యొక్క టెక్నాలజీ గురించి రైతులకు తెలియజేయాలని ఆర్.బీ.కె సిబ్బందికి ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో APMIP పీడీ రమణా రావు మార్కాపురం ఏ.డీ.ఏ రామదేవిగారు, మార్కాపురం, గిద్దలూరు హెచ్.ఓ లు రమేష్ బాబు విష్ణుప్రియ హెచ్.ఈ.ఓ వై.సి.హెచ్ శేషగిరి.మార్కాపురం, పెద్దరవీడు ఏ.ఓ లు దేవిరెడ్డి శ్రీనివాసులు బుజ్జి బాయ్ , తర్లుపాడు, పెద్దరవీడు, మార్కాపురం, కంభం, అర్ధవీడు, కొనకలమిట్ల ఆర్.బీ.కె సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article