Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుమాటతప్పని మడమతిప్పని ముఖ్యమంత్రి

మాటతప్పని మడమతిప్పని ముఖ్యమంత్రి

పార్టీలకు అతీతంగా టిడిపి కుటుంబానికి జగనన్న పథకాలలోమూడు లక్షల 50 వేల రూపాయలు లబ్ధి

ప్రతి కార్యకర్త సైనికుడు లాగా పని చేయాలి

పులివెందుల టౌన్
మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా టిడిపి కుటుంబానికి మూడు లక్షల 50 వేల రూపాయల జగనన్న పథకాలలో లబ్ధి పొందారని వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, రాబోయే రోజులు మళ్లీ మనవే అని మున్సిపల్ ఇంచార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, అన్నారు . బుధవారం పులివెందుల మునిసిపాలిటీ పరిధిలోని జయమ్మ కాలనీ వాసవి కాలనీ లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మునిసిపల్ ఇంచార్జి వై యస్ మనోహర్ రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హాఫిజ్, మునిసిపల్ కమిషనర్ రమణా రెడ్డి, జే సి ఎస్ ఇన్చార్జులు పార్నపల్లి కిషోర్, చంద్రమౌళి రెండవ వార్డ్ కౌన్సిలర్ గంగా భవాని, లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించింది అన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే అన్నారు. కులం చూడం, పార్టీ చూడం, మతం చూడమని ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీల నే కాకుండా,ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు . రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటే ప్రభుత్వ పథకాలు అన్ని అందుతాయి అన్నారు. 175 కు 175 స్థానాలు గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడి రమణ, రాజేష్ నాయుడు,సిద్దయ్య,సంపత్, కో ఆప్షన్ నెంబర్ దాసరి చంద్రమౌళి, డేనియల్ బాబు, నగిరి గుట్ట నాగరాజు, శ్రీరాములు, సుంకుర రవి కాలనీ రవి,సచివాలయం సిబ్బంది, అధికారులు, గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article