Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుమహాత్ముని ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలి:కోరుకొండ సూరిబాబు

మహాత్ముని ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలి:కోరుకొండ సూరిబాబు

జీలుగుమిల్లి
మహాత్ముని ఆశయాలను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి పైన ఉందని జీలుగుమిల్లి మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోరుకొండ సూరిబాబు అన్నారు.
మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జీలుగుమిల్లి ప్రధాని కూడలి అయినటువంటి జగదాంబ సెంటర్లో మహాత్ముని విగ్రహం వద్ద స్వాతంత్ర సమరయోధుడు శాంతి దూత జాతిపిత మహాత్మా గాంధీ కి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం అసువులుభాషినటువంటి పొట్టి శ్రీరాములు కి పూలమాలతో సత్కరించారు. మరియు ఆయనకు స్థానిక గ్రామ ప్రజలు ఆటో యూనియన్ వారు వర్తక వ్యాపారస్తులు మరియు ఆటో యూనియన్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యు నిపుణులు సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. జీలుగుమిల్లి వర్తక వ్యాపారస్తుల అధ్యక్షులు కోరు కొండ సూరిబాబు మాతం శెట్టి కిషో చిట్లూరి చందర్రావు కొనకళ్ళవికాస్ కొనకళ్ళ ముత్తయ్య. కక్కిరాల జగదీష్ కూడా పాల్గొని మహాత్మునికి ఘన నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కుష్టు రోగుల కోసం సహాయ సహకారాలు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article