Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలుబోడేవాండ్లపల్లిలో వైసీపీ నుంచి వలసలు..!

బోడేవాండ్లపల్లిలో వైసీపీ నుంచి వలసలు..!

టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్ వర్గం

చంద్రగిరి:యర్రావారి పాళ్యం మండలం, బోడేవాండ్లపల్లి పంచాయితీలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. తిరుపతి రూరల్ మండలం, రఘునాథ్ రిసార్ట్స్ లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో
పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ బి కృష్ణమ్మ, బీవీ రెడ్డి, కృష్ణయ్య, హరినాథ్ నాయుడు, సురేంద్ర, ప్రసాద్, భాను ప్రకాష్, రామచంద్ర లు పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికారాన్ని దూరం చేయడం, నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే తన గుప్పిట్లో పెట్టుకోవడం, కుటుంబ పాలన సాగించడం వంటి కారణాలతో ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వలస వస్తున్నారని పులివర్తి నాని అన్నారు. తెలుగుదేశం పార్టీలోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలోకి వస్తున్న వారందరికీ అండగా ఉంటానని, ప్రతి ఒక్కరికి సమచితస్థానం కల్పిస్తానని పులివర్తి నాని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article