Thursday, May 8, 2025

Creating liberating content

సినిమాపండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి

గాయని గీతామాధురి రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 10న తమకు కొడుకు పుట్టాడంటూ గీతామాధురి భర్త, సింగర్, నటుడు నందు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నాడు. రెండో బిడ్డ పుట్టడంతో గీతామాధురి ఇంట్లో సంబరాలు మిన్నంటగా.. సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. గీతామాధురి సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో సుమారు 800 మందికి గీతామాధురి, నందు అన్నదానం చేశారు. నందు స్వయంగా వంటకాలను తయారుచేయించి వడ్డించారు.కొంతకాలంగా గీతామాధురి పాటలకు దూరమైంది. ఈ విషయంపై యూట్యూబ్ చానళ్లలో ప్రచారం జరగడంతో కిందటి నెల గీతామాధురి వివరణ ఇచ్చింది. దాక్షాయణి ప్రకృతి (తన కూతురు) అక్క కాబోతోందంటూ ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ప్రెగ్నెన్సీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇటీవల జరిగిన తన సీమంతం ఫొటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. తాజాగా తనకు కొడుకు పుట్టినట్లు పోస్ట్ చేసింది. నందు, గీతామాధురి ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. 2019లో ఈ దంపతులకు పాప పుట్టింది. పాపకు దాక్షాయణి ప్రకృతి అంటూ నామకరణం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article