Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలునేటి నుండి రైల్వే గేట్ మూడు రోజులు బంద్

నేటి నుండి రైల్వే గేట్ మూడు రోజులు బంద్

ముద్దనూరు: నేటి నుండి మూడు రోజులు రైల్వే గేటు బంద్ కావడంతో రాకపోకలకు వాహనాల రాకపోకలు బంద్. మూడు రోజులు రైల్వే గేటు బంద్ కావడంతో జమ్మలమడుగు, గేటు అవతలి వైపు నుండి బస్టాండ్ వచ్చే వాహనాలు, పులివెందల ఆర్టీసీ బస్టాండ్ నుండి కర్నూలు, నంద్యాలకు, అలాగే కృష్ణపట్నం, హుబ్లీ, నేషనల్ హైవే67 ద్వారా గాని, మరీ చిన్న వాహనాలు అయితే రైల్వే గేటుకు అతి సమీపంలో ఉన్న బ్రిడ్జి క్రింద కానీ వెళ్లాల్సి ఉంది. ఇదే విషయాన్నిస్థానిక రైల్వే స్టేషన్ మేనేజర్ భాస్కర్ ను విచారించగా అవును నిజమేనని శనివారం నుండి సోమవారం వరకు రైల్వే గేటును మూసి వేస్తూ రైల్వే సంబంధించిన రహదారి మరింత దృఢంగా ఉండేందుకు రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకుపనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జమ్మలమడుగు ఆర్టీసీ డిపో మేనేజర్ కు, మండల పరిధిలోని తాసిల్దార్, సి,ఐ,లకు సమాచారం తెలిపినట్టు ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article