హైదరాబాద్:రూ.2,75,891 కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2024- 2025).
రెవెన్యూ వ్యయం -2,01,178 కోట్లు.
మూల ధన వ్యయం – 29,669 కోట్లు.
ఆరు గ్యారెంటీల కోసం – రూ.53,196 కోట్లు అంచనా.
మూసీ ప్రాజెక్టుకు – రూ. 1000 కోట్లు కేటాయింపు.
పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు.
ఐటీ శాఖకు రూ.774 కోట్లు.
పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు.
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు కేటాయింపు.
వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు.
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.
బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు కేటాయింపు.
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు కేటాయింపు.
ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.13,013, రూ. మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు కేటాయింపు.
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు.
యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయింపు.
రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ.. విధివిధానాలు ఖరారు చేయబోతున్నట్లు ప్రకటన.
రైతుబంధు నిబంధనలు మార్చి… రైతుభరోసా కింద ఎకరానికి రూ. 15 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామని భట్టి తెలిపారు.
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు.
విద్యుత్ గృహ జ్యోతికి రూ.2,418 కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు కేటాయంపు.
గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి ప్రకటించారు.