Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలు"జతకట్టిన జెండాలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతాయ్"

“జతకట్టిన జెండాలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతాయ్”

  • ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్

కదిరి :రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జతకట్టిన జెండాలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతాయని కదిరి అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.యస్ మక్బూల్ జోస్యం చెప్పారు. సోమవారం గాండ్లపెంట మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. “ఉదయాన్నే ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్న గాండ్లపెంట ప్రజల ఆదరాభిమానాలకు ధన్యుడను. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మిగిలేది ఒకే ఒక జెండా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించడానికి ఎన్నికలు ఎప్పుడు అంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగనన్న విజయానికి గాండ్లపెంట వైసీపీ సైనికులు చేస్తున్న శ్రమను ఖచ్చితంగా గుర్తిస్తాం. గాండ్లపెంట మండలంలో గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ సాధించేందుకు కృషి చేయాలని కోరుతున్నాను. ప్రజలకు మేలు జరగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడంతో పాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్న నాకు, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ శాంతమ్మలకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను” అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, వైసీపీ నాయకులు సాదత్ అలీఖాన్, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ మాజీ చైర్మన్ గోపాలకృష్ణ, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article