Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుజగనన్న ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యం

జగనన్న ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యం

  • ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
  • ఎంపిడిఓ దివిజ సంపతి

వేంపల్లె
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల పేదలకు మెరుగైన వైద్యం అందుతోందని ఎంపిడిఓ దివిజసంపతి, ఎంపిపి ఎన్.లక్ష్మిగాయిత్రీలు పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష-2 విడత సందర్భంగా శుక్రవారం స్థానిక 5వ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి స్పెషలిస్ట్ వైద్యులు వైద్య సేవలు అందించారు. వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికోసం ప్రత్యేక వైద్య క్యాంపు ద్వారా ఆధునిక వైద్య సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే వైద్య పరీక్షలనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా అవసరమైన వారికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి, ప్రభుత్వ ఖర్చుతో వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ స్వాతిసాయి, స్పెషలిస్ట్ వైద్యులు రమణయ్య, శ్రీనివాస్, ఇఓపిఆర్డి మల్లికార్జునరెడ్డి, సచివాలయ ఉద్యోగులు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article