Wednesday, September 10, 2025

Creating liberating content

తాజా వార్తలుఖాకీబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తారా ?

ఖాకీబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తారా ?

మాచర్ల ఘటన యావత్ పోలీస్ శాఖకే మాయనిమచ్చ..

మాచర్ల నియోజకవర్గంలో ఎస్‌ఐ వేధింపులు తాళలేక దుర్గారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖాకీబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారన్నారు.
ఖాకీబట్టలు వేసుకొని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఊడిగం చేయడం దారుణమని..దేశంలో మరెక్కడైనా ఇలాంటి విపరీతపోకడలు ఉన్నాయా అని ప్రశ్నించారు. బీసీ సోదరుడి మరణానికి కారకుడైన ఎస్ఐ శ్రీహరి వంటి పోలీసులు మరికొద్దిరోజుల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో కఠిన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article