Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుకుట్టు మిషన్ పంపిణి

కుట్టు మిషన్ పంపిణి

మానవత్వం చాటుకున్న లేపాక్షి ఆలయ చైర్మన్

హిందూపురంటౌన్ :హిందూపురం పట్టణంలోని ఆబాద్ పేటకు చెందిన ఒంటరి మహిళ స్రవంతికి లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కరణం రమానందన్ కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఆబాద్ పేటకు చెందిన స్రవంతి భర్తను కోల్పోయింది. బతుకు జీవనం కష్టమవడంతో విషయాన్ని రమానందన్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందించిన కరణం రమానందన్ ఒంటరి మహిళ స్రవంతికి కుట్టు మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం ఒంటరి మహిళ స్రవంతికి కుట్టు మిషన్ అందజేసి మానవత్వం చాటుకున్నారు. కుట్టు మిషన్ అందజేసిన వీరభద్రాలయ ధర్మకర్తల మండల చైర్మన్ రమానందన్ కు స్రవంతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article