Tuesday, November 18, 2025

Creating liberating content

తాజా వార్తలుఎం.పీ.ఎఫ్.సీ.గోడౌన్ లను వేగవంతంగా పూర్తి చేయాలి

ఎం.పీ.ఎఫ్.సీ.గోడౌన్ లను వేగవంతంగా పూర్తి చేయాలి

జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

అనంతపురము
జిల్లాలో ఎం.పీ.ఎఫ్.సీ.(మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్) గోడౌన్ లను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎం.పీ.ఎఫ్.సీ. గోడౌన్ ల నిర్మాణంలో పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎం.పీ.ఎఫ్.సీ. గోడౌన్ లకు సంబంధించి మొదటి దశలో 102 గోడౌన్ లు మంజూరుకాగా, ఇప్పటివరకు 24 గోడౌన్ ల నిర్మాణం పూర్తి కావడం జరిగిందన్నారు. నెలరోజులలోపు మరో 30 గోడౌన్ ల నిర్మాణం పూర్తి చేయాలని, మొత్తం గోడౌన్ లను మార్చి నెలాఖరులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా గోడౌన్ లకు సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే పూర్తయిన గోడౌన్లను వెంటనే వ్యవసాయ సహకార సంఘాలకు అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో డీసీఓ ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, హార్టికల్చర్ డీడీ రఘునాథరెడ్డి, మార్కెటింగ్ ఏడీ చౌదరి, ఏడీసీసీ బ్యాంక్ సీఈవో రాంప్రసాద్, నాబార్డ్ డీడీఎం అనురాధ, ఫ్యాక్సిల్ డీడీయం, ఫ్యాక్స్ సొసైటీల మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article