Wednesday, December 31, 2025

Creating liberating content

సాహిత్యం'ఇంద్రకీలాద్రి పై సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం'

‘ఇంద్రకీలాద్రి పై సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం’

ఇంద్రకీలాద్రి: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారణ జన్ముడు. తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. ఆది దంపతులైన శివపార్వతులకు తనయుడైన ఈ స్వామి దేవగణానికి సర్వసేనాధిపతిగా సర్వశక్తిమంతుడై కొనియాడబడ్డాడు.సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు, రాహువునకు అధిష్టాన దేవతయై ఉన్నారు.మానవ దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది.మానవ శరీరంలో ఉండే కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యస్వామి ఆధిదైవం. కుండలినీశక్తి మానవుని నడిపిస్తుంది.కుజుడు మానవులకు శక్తిని , ధనాన్ని, ర్యాన్నిస్తాడు.అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయిని విశ్వాసం.సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలో ఉంటారని, అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోందని పురాణోక్తి.షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించడం, వీక్షించడం వలన అవివాహితులకు వివాహ సంబంధ ఆటంకాలు తొలగి వివాహాలు జరిగి, సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో షష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించిన వారికి సత్సంతాన ప్రాప్తి, రాబోయే తరాలవారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం.షష్టిని పురస్కరించుకుని తేది. 03.05.2025 శనివారం ఉదయం మహమండపం 7వ అంతస్తు లో మంగళవాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది.ఈ సేవలో భక్తులు విశేషముగా పాల్గొని, శ్రీ వల్లీ దేవసేన సమేత స్వామివార్ల కళ్యాణం తిలకించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article