60 వేలమంది ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50పైసలకు ఇస్తున్నట్టు చెప్పిన ప్రభుత్వం రైతులు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో ఎందుకు చెప్పలేదు? : మంతెన రామరాజు
అమరావతి:సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యులు మంతెన రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. ..“ అసెంబ్లీలో నేడు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం ఏ మాత్రం సుముఖంగా లేదు. రాష్ట్ర రైతాంగం సమస్యలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసింది? ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50పైసలకు ఇస్తున్నట్టు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చెప్పిం చింది. ఎంతమందికి ఇస్తున్నారంటే 60వేల మంది ఆక్వారైతులకు అని చెప్పారు కానీ ఇంతకుముందు ఆక్వారైతులు ఎంత విద్యుత్ వాడేవారు..ఇప్పుడు ఎంత వాడుతున్నారో ప్రభుత్వం చెప్పాలి. 60వేల మంది రైతులు రోజుకి కోటి యూనిట్ల విద్యుత్ వాడుతున్నారా..లేక 30లక్షల యూనిట్ల విద్యుత్ వాడుతున్నారా అనేది చెప్పకుండా మేం రూ.1.50పైసలకే ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం బాధాకరం. వాస్తవంగా ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీలు లేక రాష్ట్రవ్యాప్తంగా ఆక్వారంగం పూర్తిగా కుదేలైంది. టీడీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి ఇబ్బందు లు లేవని, వైసీపీప్రభుత్వం వచ్చాకే పాతబకాయిల పేరుతో తమపై అధికంగా విద్యుత్ ఛార్జీల భారం మోపి వేధిస్తోందని ఆక్వారైతులు బోరుమంటున్నారు. రైతుల పక్షాన టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. పంటకాలువల్ని కూడా బాగుచేయించలేని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం.వ్యవసాయ రంగానికి కానీ, ఆక్వా సాగుకి కానీ పంటకాలువలు చాలా ముఖ్యం. వాటిని ఎప్పటికప్పుడు బాగుచేయాలి. వాటిలోని పూడిక తీయడం.. గుర్రపు డెక్క వంటి వాటిని తొలగించడం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. నీటికాలువలు పూర్తిగా నాచు, గుర్రపుడెక్క, బురదతో నిండి పోవడంతో పొలాలకు, చెరువులకు నీరు అందని పరిస్థితి. ఆక్వాసాగుకి ముఖ్యమైన ఫీడ్, సీడ్ ధరలు భారీగా పెంచారు. ఫీడ్ యాక్ట్, సీడ్ యాక్ట్ ను క్షేత్ర స్థాయిలో అమలుచేయడం సాధ్యంకాదని చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా గుడ్డిగా ముందుకెళ్లింది. పెరిగిన డీ.వో.ఆర్.బీ ధరల్ని కట్టడిచేయడంలో విఫల మైంది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులతో రైతుభరోసా కేంద్రాలు నిర్మించిన జగన్ ప్రభుత్వం, వాటిలో రైతులకు ఎలాంటి సేవలు ఎంతసమయంలో అందిస్తున్నారో చెప్పాలి. రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు ఏమీ రైతు భరోసా కేంద్రాల్లో లభించడంలేదు. ఇలాంటి సమస్యలపై రైతుల పక్షాన చర్చించడం కోసం తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇస్తే, దానిపై చర్చకు ప్రభుత్వం వెనకడుగు వేసింది. కేవలం సొంత మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలనే ఆరాటంకోసం ప్రభుత్వం అసెంబ్లీని నిర్వహిస్తోంది తప్ప, నిజంగా ప్రజలు, వారి సమస్యల పరిష్కారం కోసం కాదు. ప్రభుత్వం ఎంత మూర్ఖత్వంగా వ్యవహరించినా తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రేపు మరలా మరో అంశం పై వాయిదా తీర్మానం ఇస్తాం.” అని రామరాజు తేల్చిచెప్పారు.