Friday, May 2, 2025

Creating liberating content

తాజా వార్తలుఅర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం

అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం

అదనపు జిల్లా జడ్జి కం పల్లె శైలజ
హిందూపురంటౌన్ :అర్హత కలిగిన వారందరికీ ఉచిత న్యాయ సహాయం అందజేయడం జరుగుతుందని అదరపు జిల్లా జడ్జి కం పల్లె శైలజ తెలిపారు. శనివారం స్థానిక అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆవరణలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. చాలామంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేకపోతుంటారని అలాంటి వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. న్యాయ సహాయం అవసరమైన వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయవాదులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కాగా కొట్టూరు నిర్మల వృద్ధాశ్రమంలో జరిగిన సదస్సులో న్యాయవాదులు మాట్లాడుతూ, వృద్ధుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కుమార్తెలపై కూడా ఉంటుందని తెలిపారు. ఆశ్రయం లేని వృద్దులు భరణం కోసం న్యాయస్థానాల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా జరిగిన లోక్ అదాలత్ లో పలు కేసులను పరిష్కరించి అర్జీ దారుల నుండి వినతులు స్వీకరించారు.ఆయా కార్యక్రమాల్లో న్యాయవాదులు సుదర్శన్, పీవీ శ్రీనివాస్ రెడ్డి, వన్నెరప్ప, పార్వతి, నవేరా, రామి రెడ్డి, భరత్, రవిచంద్ర, గురునాథ్, గోపాల్, ఎస్సై హారూన్ భాష, లైజనింగ్ అధికారి శ్రీనివాసులు, లోక్ అదాలత్ సిబ్బంది శారద తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article