పులివెందుల టౌన్ :పులివెందుల పట్టణంలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జాతీయ భద్రత 35వ మాసొత్సవాల సందర్భంగా ఎం వి ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు సంభవించమన్నారు. ముఖ్యంగా వాహనాలను నిర్లక్ష్యంగా నడపరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎం వి ఐ కార్యాలయ కానిస్టేబుల్ మధు తదితరులు పాల్గొన్నారు.