Wednesday, September 10, 2025

Creating liberating content

తాజా వార్తలురెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుగవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

రెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుగవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

అమరావతి:రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. చివరగా సీఎం జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. గవర్నర్‌తో అన్ని అబద్ధాలే చెప్పించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా టీడీపీ ప్లాన్ చేసింది. టీడీపీ ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చేలా ప్రభుత్వం సైతం సమాయత్తం అవుతోంది. దీంతో సమావేశాలు వాడీ వేడీగా జరిగే అవకాశం ఉంది. వైసీపీలో చేరిన అవనిగడ్డ ఇంచార్జీగా సింహాద్రి చంద్రశేఖర్ రావు ఇక అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 7న ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది… ఫిబ్రవరి 8న బడ్జెట్‌పై ఇరుసభల్లో ప్రజాప్రతినిధులు చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article