Friday, November 14, 2025

Creating liberating content

తాజా వార్తలురామచంద్రాపురం మండలం లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఎస్పీ

రామచంద్రాపురం మండలం లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఎస్పీ

రామచంద్రపురం

తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం సి. రామాపురం, రామచంద్రాపురం మండల కేంద్రం, కమ్మ కండ్రిగ పంచాయతీల్లో తిరుపతి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు రాష్ట్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమ్ముల్లో ఉందన్నారు. కౌంటింగ్ సందర్భంగా రాజకీయ నాయకులు ఎక్కడ ఊరేగింపులు, బాణసంచా కాల్చడం ఆర్భాటాలు చేయకూడదని హెచ్చరించారు. గ్రామాలలో ప్రశాంతత వాతావరణం ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article