Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుమోడీ మళ్ళీ ఏపీకి టోపీ

మోడీ మళ్ళీ ఏపీకి టోపీ

ప్రజా గళం పై మండిపడ్డ వేలూరు

పులివెందుల టౌన్ :ప్రజా గళం సభ లో ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశా నిస్పృహ లకు గురి చేసిందని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ వేలూరు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు . సోమవార ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు,ప్రత్యేక ప్యాకేజీ ఊసే లేదు, రాజధాని ,పోలవరం ,విశాఖ ఉక్కు గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.
మోడీ మళ్లీ ఏపికి టోపీ పెట్టాడనిచంద్ర బాబు,పవన్ కళ్యాణ్ మోడీ భజన లో తరించిపోయార నీ పేర్కొన్నారు .చంద్ర బాబు చెక్క భజన బాబు గా,పవన్ కళ్యాణ్ భజన కళ్యాణ్ గా మారిపోయారు. మోడీ అంటే మోసం,మోడీ అంటే ద్రోహం,మోడీ అంటే అన్యాయం అని మరోసారి నిరూపితమైంది అన్నారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తె 6 సూత్రాల కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా మైనారిటీ కార్యదర్శి నూర్ భాషా, జిల్లా కిసాన్ కార్యదర్శి వెంగల్ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article