Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుప్రపంచ ప్రజ్ఞాశీలి,బలహీన వర్గాల ఆశాజ్యోతి డా" బి.ఆర్ అంబేద్కర్…

ప్రపంచ ప్రజ్ఞాశీలి,బలహీన వర్గాల ఆశాజ్యోతి డా” బి.ఆర్ అంబేద్కర్…

రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేద్దాం…

మున్సిపల్ కమీషనర్ వాసు బాబు……
సోషల్ వెల్పేర్ డిప్యూటీ డైరెక్టర్ జాఖీర్ హుస్సేన్….

కడప సిటీ :డా.బాబా సాహెబ్ అంబేద్కర్ నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని మున్సిపల్ కమీషనర్ వాసు బాబు అన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ అధికారులు మాసాపేట బ్రిడ్జి పై ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్నిసర్వాంగసుందరంగా,ప్రత్యేకjపూలతోఅలంకరించారు.hమున్సిపల్ కమీషనర్ వాసు బాబు,సోషల్ వెల్పేర్ డి డి జాఖీర్ హుస్సేన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లౌకిక రాజ్య స్థాపనే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగ బద్దంగా హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కే దక్కిందన్నారు. భారత జాతిని జాగృత పరిచిన ఆదర్శమూర్తి , మహోన్నత వ్యక్తి అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, న్యాయశాస్త్ర నిపుణుడు, ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు, చరిత్ర కారుడు,రాజనీతి కోవిడుదుగా అంబేద్కర్ పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. అంబేద్కర్ ఆశయాలను , సిద్ధాంతాలను స్ఫూర్తి గా తీసుకొని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి, వారి ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే వారికి నిజమైన గౌరవమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున,సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article