Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుదాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

కడప అర్బన్

మార్కెట్ యార్డ్ లోని కూలీలు, రైతులుకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు నాగయ్య తెలిపారు. మంగళవారం మార్కెట్ యార్డులోచలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలు మార్కెట్ యార్డులో నిత్యం పనులు చేస్తూ ఉంటారని దాహం వేసినప్పుడు తప్పనిసరిగా మంచినీరు త్రాగాలని ఆయన అన్నారు. వేసవికాలం పూర్తయ్యేంతవరకు ఉదయమే తాగునీటిని నిల్వ ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుమధుసూదన్, వైకాపా విద్యార్థి యువజన భాగం జిల్లా అధ్యక్షులు సందీప్ రెడ్డి,మార్కెట్ యార్డు సెక్రెటరీ సుజాత,డైరెక్టర్ సంపత్, వైసీపీ నాయకులు చిట్టి పోయిన శంకర్, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article