Thursday, May 1, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఢిల్లీకి సీఎం కేసీఆర్..

ఢిల్లీకి సీఎం కేసీఆర్..

ఢీల్లీలో ప్రారంభానికి సిద్ధంగా బీఆర్ఎస్ కార్యాలయం
న్యూఢీల్లీః
ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని మే 4న సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు.జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి.ఢిల్లీలోని వసంత్ విహార్ లో 2021 సెప్టెంబర్‌లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇపుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మించిన సెంట్రల్ పార్టీ కార్యాలయ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article