అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్
అనంతపురము
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ” స్పందన” కార్యక్రమానికి, అలాగే గ్రామ సచివాలయాల ద్వారా(జూమ్ ద్వారా) మొత్తం 134 పిటీషన్లు వచ్చాయి. జిల్లా ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ అర్జీ దారుల నుంచి వినతిపత్రాలు
స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి స్పందన పిటీషన్లకు పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా పోలీసు స్పందన విభాగం 9392926803 సెల్ నెంబర్ కు తెలియజేయవచ్చని
ఎస్పీ సూచించారు. ప్రజలకు సైబర్ క్రైమ్ కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఆన్ లైన్ వెబ్ సైట్ www.cybercrime.gov.in ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పి) లో, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ హేమంత్ కుమార్, ఎస్బీ సి.ఐ. ఇందిర, తదితరులు పాల్గొన్నారు.