కడప సిటీ ఫకడప నగరంలోని 37వ డివిజన్ ఆగడి 4 రోడ్స్ సంగం ఆఫీసు నుండి కడప నియోజకవర్గ టిడిపి-జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాల గురించి గడప గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి పాలనలో కడప ప్రజలు పడినటువంటి బాధలను దృష్టిలో పెట్టుకొని వాటన్నిటికీ ప్రత్యన్నయ్య మార్గంగా బాబు షూరిటీ భవ్యష్త్తు గ్యారెంటీ అనేటటువంటి నినాదంతో 37వ డివిజన్లో గడపగడపకు తిరుగుతూ, ప్రజల యొక్క కష్టప్రకాలను తెలుసుకొని, వారి యొక్క యోగక్షేమాల విషయాలే వారితో చర్చించి, మీ అందరి సహకారంతోటి గ్యారెంటీగా రాబోయేది టిడిపి ప్రభుత్వమే చంద్రబాబు ప్రభుత్వము యొక్క పరిపాలన రాంగానే మీ అందరూ సమస్యలు తీర్చడానికి ఆర్గారంటీలు యొక్క కరపత్రాలు మీ చేతికి ఇవ్వటం జరుగుతున్నది అన్నారు.మీ అందరి సహకారంతో మేము గెలిచిన తర్వాత ఇదే మాధవరెడ్డి మీ ముందు మీ ఎమ్మెల్యేగా నిలబడి మీకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకుంటానని మీ అందరి ముందు శబ్దం చేస్తున్నాను.ఈ కార్యక్రమంలో హరిప్రసాద్,సంగం జాకీర్, డా. నజీముద్దీన్, ముక్తియర్ పీర, ఆఫ్సర్ ఖాన్, గంగి శెట్టి, అబ్దుల్ ఖాదర్, వెంకటేశ్వర్లు, రమణ, పాలంపల్లి సుబ్బా రెడ్డి, ఫార్రూక్, జహగీర్,సునీత, పార్వతి టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
